చంద్రబాబు వైసీపీ లోకి వెళ్తే తాను బీజేపీలోకి వెళ్తానని గట్టిగా బుద్ధి చెప్పానని - పదవులపై తనకు వ్యామోహం లేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని తేల్చి చెప్పారు. విప్ పదవి తనకు వద్దంటూ ఫేస్‌-బుక్‌లో పెట్టిన పోస్ట్‌పై టీడీపీలో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో కేశినేని నానితో గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ తనకు ఆత్మాభిమానం ఎక్కువని చెప్పారు. దానికోసం దేనినైనా వదులుకుంటానని ప్రకటించారు. 
పార్టీ మారుతున్నారని తప్పుడు ప్రచారం సాగుతున్న తరుణంలో  విప్ పదవి కేటాయిస్తారా అని నాని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం.రాష్ట్రంలో పార్టీ అధికారాన్ని కోల్పోయిన తరుణంలో కూడ పదవుల పందేరంపై చంద్రబాబు తీసుకొన్న నిర్ణయంపై నాని అసంతృప్తితో ఉన్నారు.
గెలిచిన ముగ్గురు ఎంపీలు కూడా మూడు పదవులు తీసుకుందామని చంద్రబాబు ముందు చర్చ జరిగిందని గుర్తుచేశారు. కానీ తనకు పదవులపై వ్యామోహం లేదని ఆ రోజే చెప్పానని వివరించారు. అయినా తనకు పార్లమెంట్‌లో విప్ పదవి కంటే ఎంపీ పదవే చాలా గొప్పదన్నారు. దాని కోసం సొంతమైనవన్నీ వదులుకుంటా తప్ప పదవికి మచ్చ మాత్రం తీసుకురానని పేర్కొన్నారు.  బీజేపీలోకి వెళ్తున్నట్లు తనపై అసత్య వార్తలు రాస్తున్నారని తప్పుపట్టారు. అలాంటి వార్తలు రాసేవాళ్లకు తాను చెప్పేదొకటే నన్నారు. చంద్రబాబు వైసీపీలోకి వెళ్తే తాను బీజేపీలోకి వెళ్తానని గట్టిగా బుద్ధి చెప్పానన్నారు.

దీనికి ముందు జరిగిన సంఘటన కూడా కేసినేని నాని పై ఇలాంటి వార్తలు ప్రచారంలో రావటానికి కారణం అంటున్నారు: టిడిపి రాష్ట్ర కార్యాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు గుంటూరు పార్టీ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఉపయోగించుకోవాలని టిడిపి పార్టీ నేతలు భావించారు. అయితే గుంటూరు పార్టీ కార్యాలయం కంటే కూడ విజయవాడలో పార్టీ కార్యాలయమైతేనే అందరికీ అందుబాటులో ఉంటుందని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు.

దీంతో విజయవాడలో పార్టీ కార్యాలయం కోసం భవనాన్ని చూడాలని అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేశినేని నానికి వారం రోజుల క్రితం సూచించారు. వెంటనే కేశినేని నాని భవనాల కోసం వేట ప్రారంభించారు. మంగళవారం బాబు నివాసంలో పార్టీ ముఖ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విజయవాడలో పార్టీ కార్యాలయం ఏర్పాటు గురించి చర్చించారు. దేవినేని ఉమ ఉపయోగించిన కార్యాలయాన్ని తాత్కాలికంగా రాష్ట్ర కార్యాలయంగా ఉపయోగించాలని నిర్ణయం తీసుకొన్నారు. కాగా ఈ విషయం కేశినేని నానికి నచ్చలేదని తెలుస్తోంది
Image result for chandrababu kesineni nani
రాష్ట్ర కార్యాలయం కోసం భవనాలను చూడమని తనకు తొలుత సూచించి ,ఆ తర్వాత దేవినేని ఉమ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా ఉపయోగించాలని నిర్ణయం తీసుకోవడంపై కేశినేని అసంతృప్తికి గురయ్యారు. టీడీపీ ఎంపీలకు పదవులను కేటాయించే విషయమై కూడ కేసినేని అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. పదవుల పంపకంలో నాయకత్వం తీరు సరిగాలేదనే వైఖరితో ఉన్నారని చెబుతున్నారు. తనను అవమానపరచే విధంగా పదవుల పంపకం ఉందని నాని అభిప్రాయ పడినట్టుగా తెలుస్తోంది.

అసంతృప్తితో ఉన్నకేశినేనితో బుధవారం మధ్యాహ్నం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ భేటీ అయ్యారు. నానిని బుజ్జగించేందుకు జయదేవ్ ప్రయత్నించారు. అయితే సోషల్ మీడియాలో తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని జయదేవ్‌ తో నాని చెప్పారని సమాచారం.

విజయవాడ ఎంపీగా విజయం సాధించిన నాని బీజేపీలో చేరుతారని కూడ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని నాని ఖండించారు. టీడీపీకి చెందిన కీలక నేతలు బీజేపీవైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కొందరునేతలు ఈ ప్రచారాన్ని ఖండించారు. బీజేపీలో తాను చేరడంలేదని కేసినేని నాని బుధవారం నాడు స్పష్టం చేశారు.

విజయవాడ ఎంపీగా విజయం సాధించిన నాని బీజేపీలో చేరుతారని కూడ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.అయితే ఈ ప్రచారాన్ని నాని ఖండించారు. టీడీపీకి చెందిన కీలక నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కొందరు నేతలు ఈ ప్రచారాన్ని ఖండించారు. బీజేపీలో తాను చేరడం లేదని నాని బుధవారం నాడు స్పష్టం చేశారు.
Image result for chandrababu kesineni nani
ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడ పార్టీ పెద్దల తీరులో మార్పు రాలేదని భావనతో కేశినేని నాని ఉన్నారు. గల్లా జయదేవ్ తల్లి అరుణ కుమారికి పొలిట్ బ్యూరోలో పదవి ఇవ్వడంతో పాటు జయదేవ్ కు టీడీపీపీ లో కీలక పదవిని కేటాయించడంపై నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మారుతున్నారని తప్పుడు ప్రచారం సాగు తున్న వేళ “విప్ పదవి” కేటాయిస్తారా? అని నాని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. రాష్ట్రంలో పార్టీ అధికారాన్ని కోల్పోయిన తరుణంలో కూడ పదవుల పందేరంపై చంద్రబాబు తీసుకొన్న నిర్ణయంపై నాని అసంతృప్తితో ఉన్నారు. 

అంతేకాదు, లోక్‌సభలో పార్టీ విప్‌ పదవి ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. తన కంటే సమర్ధుడైన వేరొకరిని ఆ పదవిలో నియమించాలని కోరారు. అంత పెద్ద పదవికి తాను అనర్హుడినని భావిస్తున్నానని తెలిపారు. విప్‌ పదవికంటే విజయవాడ ప్రజలకు సేవచేయడంలోనే సంతృప్తి ఉంటుందన్నారు. విప్‌ పదవి తిరస్కరిస్తు న్నందుకు క్షమించమని కోరుతున్నానని స్పష్టంచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: