మహబూబ్ నగర్ జిల్లా, దేవరకదిర మండలం డోకుర్ గ్రామంలో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఈ గ్రామాలో గెలిచిన‌ బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి ప్రేమ్ కుమార్ దారుణ హత్యకు గుర‌య్యాడ‌ని, ఇది టీఆర్ఎస్ శ్రేణుల ప‌నేన‌ని బీజేపీ ఆరోపిస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు తరువాత, గెలిచిన బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి గ్రామంలో విజయోత్సవ ర్యాలీ, చేస్తుండగా, ఓడిన టీఆర్ఎస్‌ అభ్యర్థి మరియు కార్యకర్తలు ఒంటమిని జీర్ణంచుకోలేక దారుణంగా బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థిని నరికి చంపారని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.


టీఆర్ఎస్ నేత‌ల చేతిలో హతమైన బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్‌ బయలుదేరారని బీజేపీ ప్ర‌క‌టించింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరుకు చేరుకుంటారు. ఘటన పూర్వాపరాలు పరిశీలించి వారి బాధను పంచుకుంటార‌ని బీజేపీ వెల్ల‌డించింది. ఇదిలాఉండ‌గా, `టీఆర్ఎస్ గుండాల దాడిలో తీవ్ర గాయాలపాలై మహబూబ్ నగర్ SVS హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహదేవునిపేట బిజెపి అభ్యర్థి వరలక్ష్మిని పరామర్శించాను. మహిళ అని చూడకుండా ఆమెపై విచక్షణారహితంగా దాడి చేయడం దారుణం. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరాను.` అని ల‌క్ష్మ‌ణ్ తన ట్వీట్ట‌ర్ అకౌంట్లో పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: