2019 ఎన్నికల్లో జనసేన పార్టీ 23 లక్షల ఓట్లు గెలుచుకుంది. 7 శాతం దాకా ఓటు బ్యాంక్ సాధించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటు సాధించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతుంది జనసేన పార్టీ. జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు, ఆదరణ రావడానికి కారణం మాత్రం పవన్ కల్యాణ్ అభిమానులే. 

పవన్ కల్యాణ్ అభిమానులు కొంతమంది ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ జనసేన పార్టీ కోసం పని చేసారు. సోషియల్ మీడియాలో జనసేన పార్టీ తరపున ప్రచారం సాగించారు. పేద ప్రజలకు భోజనాలు, అవసరమైన చోట సేవలు అందించి జనసేన పార్టీ అభివృద్దికి సహాయపడ్డారు.

కానీ కొంతమంది పవన్ కల్యాణ్ అభిమానులమని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఇతర పార్టీలపై విష ప్రచారం చేస్తున్నారు. విమర్శ మంచిదే కానీ ఆ విమర్శ హద్దులు దాటితే ప్రమాదం. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న జనసేన పార్టీకి ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి విమర్శల వలన తటస్థుల్లో పార్టీపై వ్యతిరేఖత ఏర్పడే అవకాశం ఉంది. జనసేన పార్టీలోని కొందరు చేసే తప్పుల వల్ల అందరికి చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి వాళ్ళపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే పార్టీ అభివృద్దికి ఎంతగానొ ఉపయోగపడుతుంది


మరింత సమాచారం తెలుసుకోండి: