కేబినెట్‌ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో సంచలనమని వైఎస్సార్‌ పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. 
ఈ రోజు జరిగిన వైఎస్సార్‌ఎల్పీ సమావేశంలో అందరికీ సమ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం చూస్తుంటే, రాబోయే రోజుల్లో ప్రజలు జనరంజక పాలన చూస్తారని ఉమ్మారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

 అలాగే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక ష్ణారెడ్డి మాట్లాడుతూ.. పదవులను బాధ్యతగా తీసుకోవాలని వైఎస్‌ జగన్‌ చెప్పారని, ధర్మానికి, న్యాయానికి అండగా ఉండాలని చెప్పారన్నారు. జగన్‌ సంచలన నిర్ణయం ఇదే... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైఎస్సార్‌ఎల్పీలో చేసిన ప్రకటన కొత్త ఒరవడికి నాంది పలికింది.

అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు అవకాశం కల్పించనున్నారు. ఇది దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతో అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించడం రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి.

 అన్ని సామాజిక వర్గాలకు, అత్యంత ఉన్నత స్థానాల్లో సమ ప్రాధాన్యత కల్పించే కీలక నిర్ణయం పట్ల రాజకీయ విశ్లేషకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. 

జగన్‌ ఎన్నికల ప్రణాళికలోని అత్యంత ప్రాముఖ్యత ఉన్న '' నవరత్నాల '' పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరడానికే పంచరత్నాలు వంటి ఐదు ఉపముఖ్యమంత్రి పదవులను జగన్‌ ఇవ్వబోతున్నారని ఒక టాక్‌ రాజకీయ వర్గాల్లో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: