తెలంగాణ రాష్ట్ర విభజన అంశం కేంద్ర కేబినెట్ ఆమోదించేదాకా వచ్చింది. కానీ ఇంతవరకు కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని ఒక్క మాట అనడు, అసలు ఆయన నోట్లో నుండి సమైక్యం అనే పదమే రాదు. ఇక ఆర్టికల్ 3 ప్రకార్ తెలంగాణ ఇవ్వాల్సింది మీరేనని, ఈ మేరకు ఇడుపుల పాయలో ప్రమాణం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దీక్షలు అంటూ ఎందుకు డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసులో ఒకటి..బయట ఒకటి పెట్టుకుని రాజకీయాలు చేయొద్దు, అసలు మీ ప్రవర్తన ఎంతో బాధ కలిగిస్తుంది. విభజన విషయంలో మీ అసలు అభిప్రాయం ఏమీటన్నది బయటకు చెప్పండి అని శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఎవర్ని మోసం చేద్దామని దీక్షలకు దిగుతున్నారో చేప్పాలని ప్రశ్నించారు. 
రాష్ట్ర విభజన నిర్ణయం అత్యంత బాధాకరమని, ఈ విభజన ప్రక్రియకు సంబంధించి అసేంబ్లీ అభిప్రాయం తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేసిన ఆయన విభజనకు సంబంధించిన బిల్లు అసేంబ్లీకి ఏ రూపంలో వచ్చినా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.ఇప్పటి వరకు అసేంబ్లీ తీర్మానం లేకుండా చరిత్రలో ఏ రాష్ట్రమూ ఏర్పడ లేదని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: