- ఐదు సామజిక వర్గాలకు ఉప ముఖ్యమంత్రులు
- స్పీకర్ గా తమ్మినేని సీతారాం  
దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తన కేబినెట్‌లో ఐదు సామజిక వర్గాలకు చెందిన ఐదుగురు డిప్యూటీ సీఎంలకు అవకాశం కల్పించి ఒక కొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు కాపు సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురు ఉప‌ముఖ్య‌మంత్రులు...25 మందితో పూర్తిస్థాయి కేబినెట్‌ ఏర్పాటు చేసారు. ముఖ్యమంత్రి జగన్ నిర్యాయించినట్టుగానే  స్పీకర్ గా తమ్మినేని సీతారాం ను ఎంపిక చేసారు. 


ఉపముఖ్యమంత్రులు; 
పీడిక రాజన్న దొర (సాలూరు - ఎస్ టి), 
సుచరిత (పత్తిపాడు - ఎస్ సి),
ఆళ్ల నాని (ఏలూరు - కాపు)
అంజాద్ బాషా (కడప - ముస్లిం)
కొలుసు పార్థసారథి (పెనమలూరు - బీసీ-యాదవ). 


శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన ఎమ్ ఎల్ ఏ తమ్మినేని సీతారాం 1983 లో తొలిసారిగా ఎం ఎల్ ఏ అయ్యారు. అప్పటి నుంచి ఐదు సార్లు గెలుపొందారు. 2004 లో టి డీ పీ, 2009 లో పి ఆర్ పీ తరపున పోటీచేసి గెలుపొందారు. 2014లో వై ఎస్ ఆర్ సి పి తరపున పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. తిరిగి తాజాగా 2019 లో మరోసారి ఎం ఎల్ ఏ గా గెలుపొంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో స్పీకర్ గా కొనసాగనున్నారు. 


 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. మంత్రివర్గంలో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న వైఎస్సార్‌ఎల్పీ సమావేశంలో ఆయన పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...‘రాష్ట్రం మొత్తం మనవైపు చూస్తోంది. మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గర చేయాలి. సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాలి. అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలి.


హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిసి జ్యుడీషియల్‌ కమిషన్‌ గురించి అడిగా. ఇక నుంచి ప్రతి టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలి.  ప్రతి కాంట్రాక్ట్‌ ప్రక్రియ మొదటి నుంచి జడ్జి వద్దకు వెళుతుంది. ఏడు రోజుల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో టెండర్ల ప్రక్రియ ఉంటుంది. జ్యుడీషియల్‌ కమిషన్‌ సూచనల మేరకు ప్రతి టెండర్‌లో మార్పులు ఉంటాయి. ఆరోపణలు వచ్చిన వాటిపై రివర్స్‌ టెండర్‌ ప్రక్రియ చేడతాం. రివర్స్‌ టెండరింగ్‌లో ఎంత మిగిలిందో ప్రజలకు వివరిస్తాం. చంద్రబాబు పాలనలో అంచనాలకు మించి టీడీపీ నేతలు దోచుకున్నారు. ప్రమాణ స్వీకారం నాటి నుంచి పారదర్శక పాలన గురించే ఆలోచనలు. ఇప్పటివరకూ తీసుకున్న అన్ని నిర్ణయాలు ఆ దిశగానే చేస్తున్నాం. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం. మనం వేసే ప్రతి అడుగు ద్వారా మన గ్రాఫ్‌ పెరగాలి. నామినేషన్‌ పద్థదిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పనులు కేటాయిస్తాం.’ అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: