శనివారం ఉదయం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే వారిలో 8 మందికి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫోన్లు చేశారు. మంత్రివర్గంలోకి తీసుకోబోతున్న కారణంగా జగన్మోహన్ రెడ్డి అందరినీ ఉదయానికే సచివాలయంకు చేరుకోవాలని ఆదేశించినట్లుగా విజయసాయి ఫోన్లో విషయాన్ని అందచేస్తున్నారు.

 

 

ఇప్పటివరకూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయాణ, మేకపాటి గౌతమ్ రెడ్డి, మేకతోటి సుచరితలకు ఫోన్లు చేశారట. తాజాగా మరో నలుగురు ధర్మాన కృష్ణదాస్, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, కొడాలి నాని, కొలుసు పార్ధసారధకి విజయసాయి నుండి ఫోన్లు వెళ్ళినట్లు సమాచారం. అంతకుముందే కడప జిల్లాకు చెందిన కోరుముట్ల శ్రీనివాసులుకు స్వయంగా జగనే ఫోన్ చేసినట్లు ప్రచారంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: