ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసిన జగన్ ఫొటోలే.. ఎక్కడ విన్నా జగన్ మాటలే.  ఎన్నో సంవత్సరాల కృషి నేటికీ ఫలిచింది.  కష్టపడితే ఫలితం అదే వస్తుంది అనడానికి జగన్ పర్ఫెక్ట్ ఉదాహరణ.  ప్రజల కోసం జగన్ వాళ్ళ గడప దగ్గరికి వెళ్తే.. జనాలు ఓట్లు వేసి సిఎం కుర్చీలో కూర్చోపెట్టారు.  
ఇపుడు జగన్ ముందు అసలైన లక్ష్యం ఉంది. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువ.  ఏ పార్టీ  అధికారంలోకి వస్తే.. ఆ పార్టీ నాయకులు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తారు.  రాయలసీమ నుంచి వచ్చిన నాయకులే ముఖ్యమంత్రులుగా ఉంటున్నారు.  
అక్కడ పరిస్థితులు తెలిసిన వాటిని కంట్రోల్ చేయలేదు.  ప్రభుత్వం మారే వరకు నివురుగప్పిన నిప్పులా ఉండే ఫ్యాక్షన్ రాజకీయాలు.. ఒక్కసారిగా భగ్గుమంటుంటాయి.  ఫ్యాక్షన్ కత్తులు కుత్తుకలు తెగిపడుతుంటాయి.  ఇకపై రాయలసీమ అలాంటి దృశ్యాలు కనిపించకూడదని జగన్ ఇప్పటికే హుకుం జారీ చేశాడు.  
పటిష్టమైన, ధైర్యం కలిగిన పోలీస్ అధికారులను రాయలసీమలో నియమిస్తున్నారు.  ఇక రాయలసీమకు చెందిన రోజాను హోమ్ మినిష్టర్ గా నియమిస్తుండటంతో.. రాయలసీమ ఎలాంటి అల్లర్లు జరగవని తెలుస్తోంది.  ఫ్యాక్షన్ నాయకులను అడ్డుకోవడంలో సఫలమైతే చాలు.  రాయలసీమ రతనాల సీమగా మారుతుంది అనడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: