అభిమానుల మధ్య మొదలైన చిన్న గొడవలు హీరోల మధ్య మటలు లేకుండా చేసిన సందర్భాలను ఎన్నో చూశాం.అలాంటి అభిమానమే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ మరియు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి మధ్య గొడవను సృష్టించే పరిస్థితిని తీసుకొస్తుంది.

పార్టీ అనుకూల మీడియా సంస్థలు తమ నాయకుడిని ఎక్కువ చేసి చూపి వారి నుండి ప్రయోజనాలను పొందుతూ ఉంటాయి.అలాంటి ఓ సంస్థ వైసీపీ తమ దగ్గర ఉన్న 22 ఎంపీ లతో మరియు తెరాసా మద్దతుతో బీజేపీ మెడలు వొంచి మరి రాష్ట్ర ప్రయోజనాలను నెరవేరుస్తుందని కథనాలను ప్రసారం చేసింది.

దానితో బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా జనసేన,టీడీపీ వారు చేసిన ఆరోపణలను తిరిగి చేశారు.దానితో  వైసీపీ కార్యకర్తలు దానికి కౌంటర్లు ఇస్తున్నారు.ఇప్పుడు ఇది చిన్న గొడవ గా ఉండచ్చు కాని దీనిని ఇక్కడతో ఆపకపోతే రానున్న రోజులలో ఎన్నో అవంత్రాలకి దారితీస్తుంది.

మనవారి మీద అభిమానం ఎదుటివారిని అవమానించేలా ఉండకూడదు.ఇది పార్టీకి వారు అభిమానించే నాయకులకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: