కాంగ్రెస్ ను అట్టిపెట్టుకొని సుదీర్ఘంగా ప్రయాణిస్తున్న సీనియర్ నేత విహెచ్ ఎప్పుడూ తన నోటి దురుసు తో వార్తలలో నిలుస్తుంటారు.మరోసారి ఆయన  సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచారు.టీ.ఆర్.ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల తెలంగాణ అసెంబ్లీ లో కాంగ్రెస్స్  ప్రతి పక్ష హోదా కోల్పోయింది.

దానితో టీ.అర్.ఎస్ అక్రమంగా తమ ఎమ్మెల్యే లను చేర్చుకుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా ఆరోపించారు.దానికి వ్యతిరేకంగా బట్టి విక్రమార్క దీక్ష చేస్తున్నారు.దానికి హాజరైన విహెచ్ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ నుండి ఎంపీలుగా గెలిచిన రేవంత్ రెడ్డి,కోమటి రెడ్డిలు ఆ సభకు హాజరవకపోవడం పై సీరియస్ అయ్యారు.

అలాగే వారు ఆ సభకు ఎందుకు హాజరు కాలేదు కాంగ్రెస్ ఇన్ చార్జి కుంతీయా వివరణ కోరాలని అన్నారు. కేసిఆర్ వైఖరి పై ప్రజలు సీరియస్ గా ఉన్నారని అందుకే ఆయన పై త్వరలో తిరుగుబాటు వస్తుందని ఆయనకు ప్రజలు తప్పక బుద్ది చెప్తారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: