ఐదేళ్ల పాటు గుంటూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో జరిగిన దోపిడీకి, అరాచక పర్వానికి ఎట్టకేలకు ఈ ఎన్నికల ఫలితాలు ఫుల్స్టాప్ పెట్టేశాయి. ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేత కుటుంబం (మాజీ మంత్రిగా పనిచేసిన ఆయన ఐదేళ్ల టీడీపీ పాలనలో కీలక పదవిలో ఉన్నారు) చేసిన అరాచకాలు అన్ని ఇన్నీ కావు. వారి బెదిరింపులకు భయపడ్డ ప్రజలు ఈ సీనియర్ నేతను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. ఆయనకు ఘోరపరాజయం ఎదురైంది. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎలాగూ పోటీ చేసే పరిస్థితి లేదు. చివరకు ఆయన కుమారుడు నిలబడితే డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు.
ఐదేళ్ల పాటు ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు ఈ సీనియర్ నేత కూతురు, కుమారుడు చేసిన దోపిడీలతో విసిగిపోయారు. నోరు ఎత్తితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేస్తారో ? అన్న భయంతోనే అక్కడ ప్రజలు కాలం వెళ్లదీశారు. ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో ఆ సీనియర్ నేతకు సన్ స్ట్రోక్, డాటర్ స్ట్రోక్ గట్టిగానే తగిలాయి. ఐదేళ్ల అరాచకపర్వానికి ప్రజలు ముగింపు పలికారు. ఐదేళ్లలో ఈ కొడుకు, కూతురు చేసిన దారుణాలకు అంతే లేదు. ఇప్పుడు వారు చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.
దీంతో ఇప్పుడు వారి బాధితులు బయటకు వచ్చి ఆ పుత్రరత్నం, పుత్రికారత్నంపై కేసులు పెడుతున్నారు. రెండేళ్లలో ఈ నియోజకవర్గాల్లో అసలు అపార్ట్మెంట్లు కట్టే పరిస్థితి కూడా లేదు. ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే ఒక ఫ్లోర్కు ఒక ప్లాట్ ఆ పుత్రరత్నానికి ఇచ్చేయాలట. ఇంతకన్నా దారుణమైన దోపిడీ ఎక్కడ ఉంటుంది. ఇక పుత్రికారత్నం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరీ బెదిరించి దోపిడీకి పాల్పడింది.
తండ్రి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గ కేంద్ర పట్టణంలో ఓ వైశ్య వ్యాపారికి ఫోన్ చేసి తమ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పడంతో ఆయన ఆమె అడిగినట్టు రూ.80 లక్షల విలువ చేసే రెండు డైమెండ్ నెక్లెస్లు పంపాడట. నెల రోజులకు కూడా అవి తిరిగి ఇవ్వకపోవడంతో ఆమెకు ఫోన్ చేస్తే వాటి గురించి మరిచిపొండి అంకుల్... మా డాడీ మీకు చాలా పనులు చేసి పెట్టాడుగా అని చెప్పడంతో ఆ వ్యాపారి నెత్తినోరు బాదుకుని ఆ సీనియర్ నేతకు చెప్పుకున్నాడట. మా అమ్మాయి ఇష్టపడి వాటిని ఉంచుకుని ఉంటుంది... నీకు మరో పని ఏదైనా చేస్తానులే... వాటిని వదిలేయ్ అని చెప్పడంతో షాక్ తినడం ఆ వ్యాపారి వంతు అయ్యింది.
ఐదేళ్ల దోపిడీ సొమ్ముతో ఆ నేత పుత్రుడు గుంటూరు నడిబొడ్డున పెద్ద మాల్ కూడా కట్టాడు. దీనిని చూసి మురిసిపోయిన ఆ నేత మావాడు కాబట్టి ఎంత గొప్పగా కట్టాడో ? అని సన్నిహితులకు చెప్పాడట. ఆయన సన్నిహితులు మాత్రం దోచుకున్న దోపిడీ డబ్బుతో ఎందుకు కట్టడు అని ఆయన వెనకే గుసగుసలాడుకునే వారన్న టాక్ కూడా ఉంది. ఇక ఈ నేత పుత్రికారత్నాల ఘనకార్యాల పరంపర చాలానే ఉంది.
తండ్రికి కీలక పదవిలో ఉండడంతో ఆయనకు సన్మానాల ద్వారా వచ్చే సాలువాలను కూడా తమకు తెలిసిన ఓ వస్త్ర వ్యాపారిని బెదిరించి మరీ అమ్మి పెట్టమని చెప్పడంతో ఆయన చేసేదేమి లేక వాటిని అమ్మి పెట్టినట్టు గుంటూరు టాక్. ఇక తండ్రికి ఇచ్చే పూల బొకేల నుంచి పూల రేకులను డాబాపై ఎండబెట్టి పనిమనుషుల చేత గుజ్జు తీయించి మరీ దానిని ఫేస్కు రాసుకోవడం ఆమెకే చెల్లిందట. దీనిని బట్టి వీరి మనస్తత్వాలు ఎంత దారుణంగా ఉన్నాయో ? అసలు వీళ్లను ఆ పార్టీ నేత ఎంతలా భరించాడో ఊహకే అందడం లేదు.