కత్తి మహేష్ మళ్ళీ పవన్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్.. ఓటమి గల కారణాలను విశ్లేషిస్తూ జనసైనికులతో రివ్యూ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఎలక్షన్స్ రిజల్ట్స్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఓటమిని అంగీకరించేవాడిని కాదని.. విజయం సాధించేవరకు పోరాడుతానన్న పవన్ కళ్యాణ్.. తనను అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా చేసేందుకు భీమవరంలో తనను ఓడించేందుకు రూ.150 కోట్ల వరకూ ఖర్చు చేశారంటూ సంచలన కామెంట్స్ చేశారు.


 ఈ కామెంట్స్‌పై కత్తి మహేష్ కౌంటర్ ఇస్తూ.. పవన్ కళ్యాణ్ నోరు మూసుకుని సినిమా చేసుకుంటే మంచిదంటూ సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా ఫేస్ బుక్‌లో పవన్ కళ్యాణ్‌పై సంచలన కామెంట్స్ చేశారు. ‘‘తనని ఓడించడానికి మిగతాపార్టీలు విపరీతమైన డబ్బులు ఖర్చుపెట్టారని పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణ... పరమ లత్కోర్ ఆరోపణ.


ఎందుకంటే, తనను ఎమ్మెల్యే చెయ్యాల్సిన ప్రజలు అవినీతిపరులని, వారి కారణంగా తాను ఒడిపోయానని మాట్లాడేవాడు ప్రజాస్వామ్యానికి పనికిరాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ నోరు మూసుకుని సినిమాలు చేసుకుంటే బెటర్’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు కత్తి మహేష్. దీనితో  సహజంగానే జనసైనికులు కట్టి మహేష్ మీద కోపంగా ఉన్నారు. పవన్ వ్యాఖ్యల పట్ల రామ్ గోపాల్ వర్మ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతీ తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: