తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. 23 ఎమ్మెల్యేలు మాత్రమే గెలుపొందగా, 3 ఎంపీలుగెలిచారు. ఈ ముగ్గురు ఎంపీలలో ఒకరు రామ్మోహన్ నాయుడు. ఈ యువ ఎంపీకి క్రికెట్ అంటే పిచ్చి. ప్రస్తుతం ప్రపంచంలో వరల్డ్ కప్ మానియా ఉంది.
సెలెబ్రిటీల నుంచి అందరు వరల్డ్ కప్ చూసేందుకు ఇంగ్లాండ్ వెళ్తున్నారు. ఇలా వెళ్లిన వ్యక్తుల్లో రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. లండన్ వేదికగా ఆస్ట్రేలియా భారత్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ కు తన భార్య శ్రీ శ్రావ్యతో కలిసి వెళ్లారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారయన.
‘‘ప్రపంచకప్ లో భారత్ ఆసీస్ మధ్య మ్యాచ్ చూడడానికి మించిన మధురానుభూతి ఇంకేమి ఉండదు. గుడ్ లక్ టీమిండియా’’ అంటూ క్రికెట్ స్టేడియంలో తన భార్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన రామ్మోహన్.. ఇంతటి వైసీపీ హవాలోనూ తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి గాను తన పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మళ్లీ పర్యటించి ధన్యవాదాలు చెప్పుకొన్నారు. అలాగే ఎన్నికలకు ముందు ఊరూరూ తిరిగారు.