సీ ఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మారిపోయాయి. తన నిర్ణయాలతో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నాడు సీ ఎం జగన్ . నవరత్నాల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం మొదలుపెట్టాడు

 

హామీల అమలులో భాగంగా మొదట ఫించన్ 2000 రుపాయల నుండి 2250 రుపాయలకు పెంచాడు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 5 లక్షల అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాడు. ఉద్యోగుల ఐ ఆర్ 27% పెంఛాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసాడు

 

ఆశా వర్కర్ల వేతనం 3000 రుపాయల నుండి పదివేల వరకు పెంచాడు. రైతు భరోసా పథకం అమలు అక్టోబర్ నుండి మొదలు కాబోతుంది. అతి తక్కువ సమయంలోనే చాలా మార్పులు తిసుకువచ్చిన జగన్ భవిష్యత్తులో ఎలాంటి మార్పులు తీసుకొస్తాడో చూడాలి. ఇప్పటిదాకా జగన్ సీఎంగా తీసుకొన్న నిర్ణ్యాలపై మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: