కేంద్రం లో రెండవసారి అధికారంలోకి వచ్చిన మోదీ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన దూకుడితో ముందుకి దూసుకుపోతున్నారు.కేంద్రం అలాంటి మరో సంచలన నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా రాష్ట్ర ముఖ్య మంత్రులు అందరికీ కేవలం 5 నిమిషాలు మాత్రమే కల్పించింది.

జూన్ 15 వ తేదీన కేంద్రం నీతి అయోగ్ సమావేశాన్ని జరపాలని నిర్ణయించింది. ఈ సమావేశానికి నరేంద్ర మోదీ నేతృత్వం వహించనున్నారు. ఈ సమావేశం రాష్ట్రపతి కల్చరల్ భవన్ లో జరగనున్నది. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కు ఆహ్వానం పంపనున్నారు.

ఈ సమావేశంలో అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల కు కేంద్రం కేవలం అయిదు నిమిషాల సమయం మాత్రమే కేటాయించింది. ఈ సమావేశంలో అయిదు అంశాలను ప్రధాన అజెండలుగా చర్చిబోతున్నట్లు సమాచారం.

మరి కేంద్రం ఆహ్వానాన్ని మన్నించి ఎంతమంది ముఖ్య మంత్రులు స్వయంగా ఈ సమావేశానికి హాజరవ్వనున్నారు తెలియడానికి మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: