కర్ణాటకలోని మాండ్య నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించింది.  ఈ విజయం ఆమెకు మంచి బలాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈ బలంతో సుమలత మాండ్య ప్రజల కోసం ఏమైనా చేయడానికి సిద్ధం అయ్యింది.  మాండ్య ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన సుమలత, కొన్ని విషయాలను మీడియాతో పేర్కొంది.  


నా జీవితంలో ఎప్పుడూ చూడని ఒడుదొడుకులు రెండు నెలల్లో చూశాను. ఇప్పటివరకు  నాకే కష్టం వచ్చినా నా భర్త అంబరీశ్‌ నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహించేవారు. ఇక రాజకీయాలైతే నాకు పూర్తిగా కొత్త. నాభర్త పేరున్న రాజకీయ నాయకుడైనప్పటికీ నేను మాత్రం వీటికి కాస్త దూరంగా ఉండేదాన్ని. 


కానీ ఆయన మాకు దూరమయ్యాక మండ్య ప్రజలకు నేను దగ్గరవ్వాలనిపించింది. అవినీతి రాజకీయాలను ప్రజలెప్పుడూ క్షమించరు. నేను తిరిగి కాంగ్రెస్‌లో చేరుతాననేది అబద్ధం. నేను పోటీకి దిగినప్పుడు నాతో లగాన్‌ వంటి గొప్ప జట్టు నన్ను నడిపించింది.


ప్రజలు భర్తపై ఉన్న గౌరవంతో గెలిపించినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపింది.  ప్రజలకోసం తప్పకుండా మంచి పనులు చేస్తానని చెప్పిన సుమలత, తన ధ్యేయం ఒక్కటే అని చెప్పింది.  ఎంపీగా తాను చేయాల్సిన అన్ని పనులు తప్పకుండా చేస్తానని చెప్పింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: