- లండన్ లో ఘెరావ్ చేసిన భారతీయులు
లిక్కర్ కింగ్, సిండికేట్ విజయ మాల్యాకు లండన్ లో చుక్కెదురైంది. అక్కడ స్థిరపడ్డ భారతీయులు అతడిని గెరావ్ చేసి విజయ్ మాల్యా చోర్ హై అంటూ నినాదాలు చేసారు. దాంతో అతని ముఖం చిన్నబోయింది. భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకున్న విజయ్ మాల్యా.. ఆదివారం ఓవల్‌ మైదానంలో జరిగిన భారత్- ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్‌లో ప్రత్యక్షమయ్యాడు.

ఈ క్రమంలో మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన భారతీయులు.. ప్రేక్షకులు అతన్ని గమనించి.. వెంటనే చోర్ చోర్ అంటూ నినాదాలు చేశారు. దాంతో మాల్యా అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు.
కాగా, భారత్‌లోని బ్యాంకులకు వేల కోట్లను ఎగ్గొట్టిన కేసులో మాల్యా విచారణ ఎదుర్కొంటున్నారు. మాల్యా దాదాపు 10 వేల కోట్లకు పైగా బకాయిపడ్డ సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: