2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి గారి పార్టీ దారుణంగా ఫెయిల్ అయ్యింది.  తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఈస్థాయిలో ఓటమి చెందలేదు.  2019 లో పార్టీ భారీ పరాజయం పాలైంది.  కేవలం 23 స్థానాల్లో మాత్రం పార్టీ విజయం సాధించింది.  

2019 లో కూడా పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకంలో చాలామంది నాయకులు పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు.  ఇలా జాయిన్ కావడం వాళ్లకు కలిసొస్తుంది అనుకున్నారు.  అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి... అన్నట్టుగా మారిపోయింది.  

అనంతపురం జిల్లాకు చెందిన జెసి దివాకర్ రెడ్డి ఇప్పటికే తన రిటైర్మెంట్ ను ప్రకటించారు.  ఈ సీనియర్ నేత బాటలోనే మరికొందరు నేతలు కూడా రిటైర్ కావాలని అనుకుంటున్నారు.  అలాంటి వ్యక్తుల్లో ఒకరు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి.  గత ఎన్నికల్లో అయన టిడిపి తరపున పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు.  అలాగే ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ కూడా ఓటమి పాలైంది.  

ఓడిపోయిన ఈ నేతలు టిడిపిలోనే ఉండి ఐదేళ్లు అక్కడే ఉండాలి అంటే మాత్రం కుదరని పని. అందుకే చాలామంది నేతలు.. ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నాయి.  త్వరలోనే కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు త్వరలోనే బీజేపీలోకి జాయిన్ కాబోతున్నారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: