సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి అందరినీ కలుపుకుని పోతున్నారు. పక్క రాష్ట్ర సీఎం అయిన కేసీయార్ తోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోను ఎలాంటి విభేదాలు లేకుండా చక్కగా సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇలా అందరితోను సఖ్యత స్నేహభావం చూపటం మన రాష్ట్ర అభివృద్దికి ఎంతో ఉపయోగపడుతుంది

 

దీని ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం వేల కోట్లతో అనంతపూర్ నుండి అమరావతి హైవే మార్గానికి నిధులు అందిస్తుంది. సీఎం కేసీయార్ తో మైత్రి వలన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య ఏవైనా సమస్యలున్నా సామరస్యపూర్వక పరిష్కారాలు వస్తాయి

 

సీఎం జగన్ అధికారులను కూడా తన నిర్ణయాలతో ఆనందాల్లో ముంచెత్తుతున్నాడు. ఉద్యోగులకు ఐ ఆర్ 27% పెంచడం సీపీఎస్ రద్దు చేస్తుండటం, పని గంటలు తగ్గించటం వలన ఉద్యోగులు వాళ్ళ పనిని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించగలరు. మొత్తానికి జగన్ పాలన అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూ అందరికీ మేలు జరిగేలా చేస్తుంది


మరింత సమాచారం తెలుసుకోండి: