అలాంటిది ఇప్పుడు ఆ పట్టణంలో జేసీ ట్రావెల్స్ పై దాడి జరగడం అంటే మాటలు కాదు! దివాకర్ ట్రావెల్స్పై వైసీపీ నాయకులు దాడి చేశారని తెలుస్తోంది. ఫర్నిచర్ను ధ్వంసం చేసి అందులో పనిచేస్తున్న ఇరువురు సిబ్బందిపై దాడిచేశారు. నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న వైసీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి శిబిరం సమీపంలో ఈ సంఘటన జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అసలు జేసీ ఆఫీసుపై దాడికి పూనుకోవడం అంటే అది అలాంటిలాంటి సాహసం కాదు. జేసీని ఢీ కొనడం అంటే మాటలు కాదు. అయితే సమైక్యవాదం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ శక్తిని ఇచ్చింది. జేసీ ని విమర్శించడానికి కూడా భయపడాల్సింది పోయి.. జేసీ ఆఫీసులపై దాడు అంటే పర్యవసనాలకు సిద్ధపడే దాడికి దిగారని అనుకోవాలి. సమైక్యవాద ఉద్యమంలో భాగంగా రెండు నెలలుగా బంద్ కొనసాగుతున్నా.. జేసీ బస్సులు మాత్రం తిరిగాయి. ఇప్పుడు ప్రత్యర్థులు ఆ బస్సుల ఆఫీసుపై దాడికి దిగారు. మరి ఇతి తాడిపత్రి