మానవత్వం పరిమళించిన సంఘటన ఇది.హిందూ
ముస్లిం భాయి-భాయి అనడానికి మరియు భారతదేశం లౌకిక వాద దేశం అని నిరూపించిన
సంఘటన.భారతదేశం సర్వమత సమ్మేళనం అని మరోమారు నిరూపించిన ఘటన హర్యానాలోని
బల్లభ్గర్హ్ లో ఆదివారం జరిగింది.
హర్యానా నుండి అలీఘర్ కు ప్రయాణిస్తున్న
ఒక ముస్లిం కుటుంబం పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.బైక్ పై వచ్చిన
దుండగులు వ్యాన్లో వెళ్తున్న వారిపై దాడి చేశారు.ఈ దాడిలో డ్రైవర్
గాయపడ్డాడు.ఇంటి పెద్ద అయిన షఫీ పై కూడా దాడి చేశారు.వ్యాన్ లో
ప్రయాణిస్తున్న హిందూ మతానికి చెందిన పూజ వ్యాన్ లో నుండి బయటికి వచ్చి
గూండాలతో వాగ్వాదానికి దిగింది.
అందులో ఒక వ్యక్తి పూజను హిందూ మతానికి
చెందిన వ్యక్తిగా గుర్తించి దాడి చేయకుండా వెళ్లిపోయారు. ఈ
ఘటనపై షఫీ మాట్లాడుతూ పూజ ఫ్యామిలీ తనకు 32 సంవత్సరాలుగా తెలుసునని, తనకు
పూజ కూతురు లాంటిదని తెలిపారు.తన వల్లే మా ప్రాణాలు దక్కాయని కూడా
చెప్పారు.ఆ తర్వాత అందరూ క్షేమంగా అలీఘర్ కి చేరుకున్నారు.
దీనిపై
పూజ అలీఘర్ లోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఘటనపై పోలీసులు కేసు
నమోదుచేశారు.IPC సెక్షన్స్ 147,148,323,మరియు 507 సెక్షన్ల కింద కేసు
నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ అధికారులు
మాట్లాడుతూ చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దు అని తెలిపారు.ఘటనపై
దర్యాప్తు చేస్తున్నామని ఇప్పటివరకు ఎవరిని అనుమానితులుగా గుర్తించలేదని
తెలిపారు. గుండాలను ధైర్యంగా ఎదుర్కొన్న పూజను పోలీసులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.