ఆంధ్రప్రదేశ్ లో బుధవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమేశాల్లో వైసీపీ 151, తెలుగుదేశం 23, జనసేన నుంచి గెలుపొందిన ఒకరు తోలిరోజు ఏర్పాటైన అసెంబ్లీ సమావేశాల్లో ఇరు పార్టీల నేతలు పరస్పరం పలకరించుకున్నారు.
అసెంబ్లీ సమావేశాల తొలిరోజు లాబీలు సందడిగా కనిపించాయి. అధికార, విపక్ష ఎమ్మెల్యేలు ఒకరినొకరు పలకరించుకున్నారు. మంత్రి కొడాలి నాని, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ పలకరించారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్యే జోగి రమేష్లతో టీడీపీ సభ్యుడు నందమూరి బాలకృష్ణ కరచాలనం చేశారు.
అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన నేతలు ఇలా పరకరించుకోవడం భాగానే ఉంది. మరి ఈ ఇరు పార్టీల నేతలు సమావేశాల్లో ఎలా వాదించుకుంటారో చూడాలి...