శాసనసభకు వైసీపీ ఫైర్‌ బ్రాండ్ ఆర్కే రోజా కేం బాక్! ఏపీ శాసన సభ సమావేశాల ప్రారంభమైన రెండో రోజే తన దైన శైలిలో ప్రతిపక్షంపై విరుచుకు పడ్డారు నగరి ఎమ్మెల్యే రోజా. తమ్మినేని సీతారాం స్పీకర్ కుర్చీని అలంకరించే సమయంలో చంద్రబాబు వేదికపైకి రాకపోవడాన్ని రోజా తీవ్రంగా తప్పుబట్టారు. అనుభవం ఉన్న నేత హుందా తనంతో వచ్చి స్పీకర్‌ని కూర్చోబెట్టవచ్చు కదా! అని ప్రశ్నించారు. ప్రతి దాన్నీ రాజకీయం చేయడం టీడీపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు రోజా. 


“మంచిచెడుల గురించి మాట్లాడేటప్పుడు ఉదాహరణగా గతాన్ని తీసుకుంటాం. వైసీపీ నేతల మాటలపై టీడీపీ నేతలు ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదు. స్పీకర్‌ని అవమానించడం స్పీకర్ పదవిని దుర్వినియోగం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. తమ్మినేని సీతారాం స్పీకర్ అయినందుకు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వాసులు సంతోషపడాలి. కానీ అచ్చెన్నాయుడికి సంతోషం కంటే కడుపు మంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. చెవి రెడ్డి మాటలపై రాద్ధాంతం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని అంటున్నారు. ఐదేళ్లలో టీడీపీ నేతలు మాట్లాడిన మాటలకు ఎన్ని రోజులు గుంజీళ్ళు తీసి, లెంపకాయలు వేసుకున్నా సరిపోదు. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి ఘనంగా జరుపుతారు. కానీ ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీని తీసుకొని అసెంబ్లీలో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. యనమల రామృష్ణుడిని ఉపయోగించి సభాపతి స్థానాన్ని ఎలా? దుర్వినియోగం చేశారో? అందరికీ తెలుసు. గత అసెంబ్లీలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ గురించి నేను మాట్లాడితే రూల్స్‌కు విరుద్థంగా ఏడాది సస్పెండ్ చేశారు. కోర్టు తీర్పును కూడా గౌరవించకుడా నన్ను లోపలికి రానీయకుండా మార్షల్స్‌తో బయటకు నెట్టేశారు. మీరా సభా సంప్రదాయాల గురించి మాట్లాడేది” 


సభాపతి స్థానం తండ్రి లాంటిదని అన్నారు రోజా. తండ్రి అందరినీ సమానంగా చూస్తారని, సభలో సభ్యులందరినీ స్పీకర్ సమానంగా చూడాలని ఆమె అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం అందరికీ అవకాశాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నట్లు రోజా తెలిపారు.


శాసనసభలో వైసీపీ శాసనసభ్యుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీడీపీ శాసనసభ్యుడు కింజరపు అచ్చెన్నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. "బంట్రోతు అంటే అర్థం సేవకుడు అని. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డిని నరరూప రాక్షసుడు అన్నారు. అప్పటి వ్యాఖ్యలకు క్షమాపణ చెబితే, నేనూ క్షమాపణ చెప్తా. నారా చంద్రబాబు నాయుడు పుట్టిన నారావారిపల్లె ఉన్న నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. 
Image result for chevi reddy bhaskara reddy on AchchennayuDu

గతంలో శభాపతి (స్పీకర్) ఎన్నికల సందర్భంగా నోట్ పంపామని టీడీపీ నేతలు చెబుతున్నారు. కోడెల శివప్రసాద్ ను స్పీకర్‌ గా ఎన్నుకోగానే జగన్ స్వయంగా చేయిపట్టు కుని సీటు వరకూ వచ్చి కూర్చోబెట్టారు. ఆ రోజున టీడీపీ కంటే వైసీపీ నేతలు ఎక్కువ సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు ఒక బలహీనవర్గానికి చెందిన ఎమ్మెల్యేను స్పీకర్ కుర్చీలో కూర్చో బెట్టేందుకు టీడీపీ నేతలకు మనసు రాలేదు. వీళ్లా సభా సంప్రదాయాల గురించి మాట్లాడేది. స్పీకర్ బలహీనవర్గాలకు చెందినవారు కాబట్టే, మీ చేయి పట్టుకోవడానికి టీడీపీ నేతల మనసు ఒప్పుకోవడం లేదు. అదే స్థానంలో తమ సామాజిక వర్గం వ్యక్తి ఉండి ఉంటే, చేయి పట్టుకుని స్వయంగా తీసుకెళ్లి కూర్చోబెట్టేవారు. కానీ ఇప్పుడు స్పీకర్‌ ను కుర్చీ వద్దకు తీసుకెళ్లేందుకు తన బంట్రోతును పంపారు" అని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు.
 

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేసిన వ్యాఖ్యలు శాసనసభలో దుమారం రేపాయి. భాస్కరరెడ్డికి మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలపై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. బీసీ వర్గానికి చెందిన అచ్చెన్నాయుడును బంట్రోతు అంటారా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత అహంభావం ఉంటే చెవిరెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానిస్తారని మండిపాడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: