రాష్ట్రంలో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  కొత్తగా పదేళ్ల క్రితం ప్రారంభించిన పార్టీ ఆంధ్రపదేశ్ లో అధికారంలోకి వచ్చింది.  40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న బాబు ఎప్పుడు లేని ఓటమిపాలయ్యారు.  పార్టీని గెలిపించుకోలేక చతికల పడ్డారు.  కేవలం 23 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. 


ఇప్పుడు ఆ పార్టీపై పెద్దగా ఎవరికీ విశ్వాసం లేదు.  23 మంది ఎమ్మెల్యేలలో కొంతమంది తిరిగి పార్టీ మారాలని అనుకుంటున్నారు.  ఇప్పటికైతే ఆరుగురు పార్టీ మారబోతున్నట్టు స్పష్టమైన సందేశాలు అందుతున్నాయి.  అయితే, పార్టీ మారాలని అనుకున్న ఆరుగురు తప్పకుండా పార్టీకి, పదవికి రాజీనామా చేసి వైకాపాలోకి రావాల్సిందే.  


అంటే ఎంతమంది వైకాపాలోకి వెళ్లాలని అనుకుంటారో వాళ్లంతా తప్పకుండా రాజీనామా చేయాలి.  ఆయా ప్రాంతాల్లో మళ్ళీ ఉపఎన్నిక జరుగుతుంది. ఒకవేళ ఎన్నికలు జరిగితే.. తప్పకుండా అక్కడ మరలా మూడు పార్టీలు పోటీ చేస్తాయి.  ఎవరికి అవకాశం ఉంటుంది అన్నది సస్పెన్స్.  


తెలుగుదేశం పార్టీ గెలిస్తే... నాయకులు మారినా, కార్యకర్తలు మారలేదని, వాళ్లకు తెలుగుదేశం పార్టీవైపే ఉన్నారని రుజువౌతుంది.  అలా కాకుండా, వైకాపా గెలిస్తే.. ఫ్యాన్ గాలి వీచింది అనుకుంటారు.  ఈ రెండు కాకుండా.. ఉపఎన్నికల్లో జనసేన గెలిస్తే.. రెండింటికి ఎందుకు మరో కొత్తపార్టీకి అవకాశం ఇచ్చారని సంతోష పడొచ్చు.  ఇప్పుడు రాష్ట్రంలో పార్టీలు మారే విషయంలో ఏం జరుగుతుందో అర్ధం కాకుండా ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: