అభిమానం వేరు.. రాజకీయం వేరు.. ఒకప్పుడు అభిమాన నటుడి సినిమా రిలీజ్ అయితే... పెద్ద పండుగ చేసుకున్న అభిమాని.. నేడు ఏపి ముఖ్యమంత్రి హోదాలో బాలయ్యను కలుసుకున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి. కానీ ఇది నిజం.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. బాలకృష్ణకు వీరాభిమాని.  
ఎలాంటి అభిమాని అంటే.. కడపజిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా పనిచేశారు.

సమరసింహా రెడ్డి సినిమా సమయంలో 2000 సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ సమరసింహా రెడ్డి ఫోటో కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని వేయించుకున్నారు.  ఈ ఫోటో అప్పట్లో పేపర్లో కూడా వచ్చింది.  

బాలకృష్ణ సినిమాలంటే ఇప్పటికి జగన్ కు మంచి ఆసక్తి ఉన్నది.  ఎంతైనా తన అభిమాన హీరో కదా.  అభిమానం వేరు రాజకీయాలు వేరు.  2014 నుంచి బాలకృష్ణ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు.  2014లో వైకాపా అధ్యక్షుడు జగన్ కూడా అసెంబ్లీలో ఉన్నారు.  బాలకృష్ణ.. జగన్ లు ఒకటి రెండు సార్లు పలకరించుకున్నా.. ఈ విషయాలు ఏవి బయటకు రాలేదు.  

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ విషయం బయటకు వచ్చింది.  అప్పటి పేపరుకెక్కిన ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యకు వైఎస్ జగన్ అభిమాని అనే పేరుతో మీడియాలో కథనాలు వస్తున్నాయి.  బాలకృష్ణకు ఇది గర్వంగా ఉండొచ్చు.. పాపం మరి బాబు ఈ విషయంలో ఎలా ఫీలవుతున్నారో..!!!


మరింత సమాచారం తెలుసుకోండి: