స్థానిక సంస్థల కోటాలో కొత్తగా ఎన్నికైన నలుగురు సభ్యులతో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనమండలి సభ్యులుగా పట్నం మహేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,  ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ లు ప్రమాణ స్వీకారం చేశారు.


ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి   మాట్లాడుతూ.. ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రజలకు, అందుకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. 


ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి.. వరంగల్ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పారు. ఇక నల్గొండ జిల్లాలో అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలని తెర చిన్నపరెడ్డి  అన్నారు. కాగా,  ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు ఎర్రబెల్లి, మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: