పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు రూ. 4,318.97 కోట్లు, ఎడమ ప్రధాన కాలువకు రూ. 4,202.69 కోట్లు, హెడ్ వర్క్స్కు రూ.9,734.34 కోట్లు, పవర్ హౌస్ పనులకు రూ. 4,124.64 కోట్లు, భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ పనులకు రూ.33,168.23 కోట్ల రూపాయలు అంచనా ఖర్చులకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2014 మార్చి 31 నాటికి ఖర్చు చేసిన రూ.5,175.25 కోట్లలో రూ.3,777.44 కోట్లకు ఆడిట్ జరిగిందని.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికల ఆధారంగా తదుపరి నిధుల విడుదల ఉంటుందని కేంద్రం తెలిపింది.
ఇటీవలే పోలవరం వెళ్లిన జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటి వరకు జరిగిన ఖర్చు, పనుల పురోగతిపై ఆడిట్ చేపడతామని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ సాంకేతిక అంశాలతోపాటు ఇప్పటిదాకా అయిన వ్యయం, బిల్లుల చెల్లింపు, ప్రాజెక్టు పురోగతి, ఇతర అనేక అంశాలపై ఈ తనిఖీ చేపడుతుందని, ఇందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పోలవరం ప్రాజెక్టును 2021 ఫిబ్రవరి నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని జగన్ ఆదేశించారు.