సాధారణంగా రద్దీ ఉన్న ప్రదేశాల్లో జేబుదొంగలు రెచ్చిపోతుంటారు.  ఇక సభలు, సమావేశాలు, సెలబ్రెటీలను తిలకించడానికి వచ్చే వారి వద్ద జేబుదొంగల వాటం ఎలా చూపిస్తారో అందరికీ తెలిసిందే. తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో జేబుదొంగలు హల్ చల్ చేశారు.  బుధవారం ఉదయం గుంటూరు జిల్లాలోని దశావతారం వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చారు పవన్ కళ్యాన్. 

దేవాలయానికి పవన్ కళ్యాన్ వస్తున్న వార్త తెలుసుకొని చాలా మంది అభిమానులు అక్కడకు వచ్చారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో జేబు దొంగలు రెచ్చిపోయారు. తమ పనితనం ఏంటో అక్కడున్నవారికి చూపించారు. ఆ దొంగలకు బలైన వారిలో దేవాలయ నిర్వాహకుడు ఒకరు..ఆయన జేబు నుంచి రూ.25వేలు కొట్టేశారు. అంతేకాదు మరికొంతమంది జేబులు కూడా కొట్టేశారు. 

తమ అభిమాన నటుడు పవన్ కళ్యాన్ చూసే ఆనందంలో ఏం జరుగుతుంతో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న వారు తర్వాత జరిగింది తెలుసుకొని..తాము దారుణంగా దోపిడీ అయ్యామని తెలుసుకొని లబో దిబో అన్నారు. కాగా,  దశావతాం వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం వద్దకు వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు దేవాలయ అధికారులు, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో పవన్ కు స్వాగతం పలికారు. పూజలు అనంతరం పవన్ విజయవాడలోని నివాసానికి వెళ్లిపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: