అమర్నాథ్ యాత్ర..  పరమ పవిత్రంగా భావించే యాత్ర ఇది.  దీని కోసం భక్తులు కొన్ని నెలల ముందు నుంచి ప్రిపరేషన్ అవుతారు.  అత్యంత క్లిష్టమైన ఈ యాత్ర చేయాలంటే చాలా ధైర్యసాహసాలు కావాలి.

 

అయితే అమర్నాథ్ యాత్ర పై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఈ మేరకు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. జైష్ ఏ మహ్మద్ సంస్థ కు చెందిన ఉగ్రవాదులు దాడి చేసే అవకాశాలు ఉన్నాయని నిఘా సంస్థలు  హెచ్చరించాయి.

 

అప్రమత్తంగా ఉండాలని భద్రతా బలగాలను కూడా  నిఘా వర్గాలు   హెచ్చరించాయి. హోంమంత్రి అమిత్ షా కాశ్మీర్ పర్యటన ముగిసిన మరుసటిరోజే నిఘా వర్గాల హెచ్చరికలు  జారీ చేయడం విశేషం.

 

గతంలోనూ అమర్నాథ్ యాత్ర సమయంలో ఉగ్రవాదులు దాడులు చేశారు.  ఈ నేపథ్యంలో నిఘా వర్గాల హెచ్చరికలు  భక్తులకు కొంత ఆందోళన కలుగజేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: