''మన చంద్రబాబు భద్రత మరింత తగ్గింపు..''


''.ఇద్దరు ప్రధాన భద్రతా అధికారులు15 మంది సిబ్బందిని పూర్తిగా తొలగింపు... ''


''చంద్రబాబు భద్రత ప్రస్నార్ధకం చేసిన ప్రభుత్వం..'' ఇవీ social media లో తెలుగు దేశం పార్టీ అభిమానుల వ్యాఖ్యలు.


'' మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత మన చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను మరింత కుదించింది. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులకు భద్రతను తొలగించటంతో పాటు, చంద్రబాబు వాహనశ్రేణిలో స్థానిక పోలీసులు ఇవ్వాల్సి ఉన్న ఎస్కార్ట్‌, పైలెట్‌ క్లియరెన్స్‌ వాహనాలను తొలగించిన సర్కారు తాజాగా మరో వివాదాస్పద చర్యకు పూనుకుంది. చంద్రబాబుకు ఉండే ఇద్దరు ప్రధాన భద్రతా అధికారులను తొలగించటంతో పాటు వీరికి అనుబంధంగా ఉండే ముగ్గురు ఆర్‌.ఐల నేతృత్వంలోని దాదాపు 15 మంది సిబ్బందిని పూర్తిగా తప్పించారు.


2004 నుంచి 2014 వరకు పదేళ్లు ప్రతిపక్షంలో ఉండగా ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గురు ఆర్‌ఐ బృందాలతో చంద్రబాబుకు గత ప్రభుత్వాలు భద్రత కల్పిస్తూ వచ్చాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అందరినీ తొలగించి ఇద్దరేసి కానిస్టేబుళ్లు చొప్పున రెండు బృందాలుగా 2+2గా కేటాయించడం వివాదాస్పదమవుతోంది.


2003లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మావోయిస్టులు మందుపాతర పేల్చి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తెలిసిందే.


అప్పటి నుంచి ఆయనకు జడ్‌ప్లస్‌ భద్రతతో పాటు ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పించారు. ఆతర్వాత అధికారం కోల్పోయినా.. ఇద్దరు సీఎస్‌వోలతో జడ్‌ ప్లస్‌, ఎన్‌ఎస్‌జీ కొనసాగిస్తూ వచ్చారు.


ఇటీవలే చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చేసరికి ఆయన కుటుంబానికి భద్రతను తొలగించారు. జడ్‌ కేటగిరిలో ఉన్న మాజీ మంత్రి నారా లోకేశ్‌కు 2+2 గన్‌మెన్లు కేటాయిస్తూ వై ప్లస్‌కు కుదించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులైన భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్‌లకు భద్రతను పూర్తిగా తొలగించారు. భద్రత రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకుందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపేనని తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: