అక్రమనిర్మాణాల కూల్చివేతలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బిజెపి సంపూర్ణ మద్దతు ఇస్తోంది. బిజెపిలో కీలక నేత దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ కరకట్టపైన ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేయాల్సిందే అన్నారు.  అక్రమనిర్మాణాలు కూల్చేయటంలో పార్టీలు, నేతలను ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

 

కరకట్టపై ఉన్న అక్రమనిర్మాణాల్లో బిజెపి మాజీ ఎంపి గోకరాజు గంగరాజుకు కూడా ఓ భారీ నిర్మాణం ఉందన్న విషయం తెలిసిందే. అయితే పురంధేశ్వరి ఏ నేత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకుండా అక్రమనిర్మాణాలను కూల్చేయటంలో పార్టీలు, నేతలను పట్టించుకోవద్దని చెప్పటమే చర్చనీయాంశమైంది.

 

రాష్ట్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి ఏమడిగినా చేయటానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని బిజెపి నేత చెప్పటమే విచిత్రంగా ఉంది. ఒకవైపేమో ఏ సహాయం కావాలన్నా చేస్తామంటారు. అదే సమయంలో ప్రత్యేకహోదా తప్ప అంటు మెలికపెడతారు.

 

గత ప్రభుత్వంలో భారీ ఎత్తున అవినీతి జరిగిన కారణంగానే ప్రజలు చంద్రబాబునాయుడును ఓడించినట్లు చెప్పారు. మొత్తానికి చంద్రబాబుపై పురంధేశ్వరి ఈ విధంగా కసి తీర్చుకుంటున్నట్లుంది. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, భూదందాలతో టిడిపి నేతలు జనాలను పీక్కుతిన్నారట. మొత్తం మీద చంద్రబాబును దెబ్బకొట్టటానికి తలా ఓ చేయి వేస్తున్నట్లే ఉంది చూస్తుంటే.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: