తెలుగుదేశం పార్టీ తన చరిత్రలోని అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఓవైపు తెలంగాణలో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా...ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ.. అదే దుస్థితి ఎదురయ్యేలా ఉంది. తెలుగుదేశం పార్టీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో... ఏకంగా 16 మందిని చీల్చేందుకు బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
అలా చేయడం వల్ల తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ కాస్త... బిజెపి లెజిస్లేచర్ పార్టీ గా మారుతుంది. తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. ఇప్పటికే బిజెపి ఇందుకు పూర్తిగా రంగం సిద్ధం చేసింది.
బిజెపి ప్రయత్నాలు పసిగట్టిన చంద్రబాబు.. తెలుగుదేశం ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. పార్టీ మారవద్దని ఎమ్మెల్యేలను నయానోభయానో బుజ్జగిస్తున్నారు.. పార్టీ మారకుండా ఉంటే ఒక్కో ఎమ్మెల్యేకు పది కోట్ల రూపాయల వరకు ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరి టిడిపి ఎమ్మెల్యేలు ఈ 10 కోట్ల బంపర్ ఆఫర్ కు లొంగుతారా ? లేక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పంచన చేరితే అంతకంటే ఎక్కువ లాభం ఉంటుందని ఆలోచిస్తారా.. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో..?