వైసీపీ అధికారంలోకి వచ్చి కనీసం నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే రాష్ట్రంలో ఎదో జరిగిపోతున్నట్టు చినబాబుగారు తెగ కంగారు పడిపోతున్నారు. కేవలం బాబుని చినబాబుని ఓదార్చి ఫొటోలకు ఫోజులిచ్చి డబ్బులు తీసుకెళ్లడం ఒక్కటేకాదు, పెయిడ్ ఆర్టిస్ట్ లతో నాలుగు మాటలు మాట్లాడించి సీఎం జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు టీడీపీ నేతలు. ఇవన్నీ చినబాబు లోకేష్ నేతృత్వంలో జరుగుతున్నాయి.


ప్రజావేదిక కూల్చివేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ ఓ మహిళ ఆగ్రహావేశాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు లోకేష్. ఆమె మాటలు వింటే.. కచ్చితంగా భలే మంచి ఆర్టిస్ట్ అనిపించకమానదు. ప్రజావేదిక కూల్చివేస్తే మా సొంత ఇల్లు కూల్చినట్టు బాధఫడ్డామని స్టార్ట్ చేసి, మేమూ దేవుని బిడ్డలమే అంటూ కులాన్ని కూడా మధ్యలోకి తెచ్చి, చివరకు జగన్ కి శాపనార్థాలు పెట్టి తన ఎపిసోడ్ ముగించింది ఆ మహిళా ఆర్టిస్ట్.


పచ్చ మీడియా కూడా ఈ ఎపిసోడ్ ని ప్రముఖంగా చూపిస్తోంది. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది, ఏదో ప్రమాదం ముంచుకొస్తోంది అన్నట్టుగా ప్రజలంతా రోడ్లపైకి వస్తున్నారని బిల్డప్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబుకి భద్రత తగ్గించారంటూ ఇలా పెయిడ్ ఆర్టిస్ట్ లతో గగ్గోలు పెట్టిస్తున్నారు. ఈమాత్రం దానికే ఇంత రచ్చచేస్తే.. రేపు వేల కోట్ల అవినీతి పునాదుల్ని కూకటి వేళ్లతో సహా పెకలించి వేస్తున్నప్పుడు ఇంకెంత గొడవ చేస్తారో ఊహలకే అందడంలేదు. ముందు ముందు టీడీపీ డ్రామాలు ఇంకెన్ని చూడాలో అని తలలు పట్టుకుంటున్నారు సామాన్య జనాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: