ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి నిన్న, మొన్నటి వరకు గిరిజనేతరురాలన్న వివాదాన్ని ఎదుర్కొని వార్తల్లో వ్యక్తిగా నిలవగా, ప్రస్తుతం తాను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి  వైకాపా  నేత కాకుంటే చూసుకునేదాన్ని కాదంటూ సంచలన ప్రకటన చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది .


తాజాగా ఆమె ఒక వెబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి వైకాపా నేత కావడం వల్లే, పెళ్లి కి అంగీకరించానని , లేకపోతే చేసుకునేదాన్ని కాదని ఆయనతోనే చెప్పినట్లు వెల్లడించింది . తనకు ఎమ్మెల్యే గా పోటీ చేసే అవకాశం కల్పించడమే కాకుండా , ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి రాజకీయంగా తనని ప్రోత్సహించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తనకు దేవుడితో సమానమని చెప్పుకొచ్చారు .


పెళ్లి చేసుకునే విషయం లో కొంతమంది కుల, మత పట్టింపులు ఉండడం సహజమేనని , అయితే పుష్ప శ్రీవాణి మాత్రం తమ పార్టీకి చెందిన నాయకున్ని పెళ్లి చేసుకోవాలని మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించిందని పలువురు పేర్కొంటుంటే,  మరికొందరు మాత్రం పార్టీ పట్ల ఆమెకున్న నిబద్ధతకు ఇదొక నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: