తెలుగుదేశంపార్టీ నుండి
తొందరలో ఓ బిగ్ వికెట్ డౌన్ అయ్యే అవకాశం ఉందట. అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో
టిడిపి తరపున గెలిచిన పయ్యావుల కేశవ్ తొందరలో టిడిపికి రాజీనామా చేయాలని డిసైడ్
అయినట్లు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది.
టిడిపిలో ఓ సెంటిమెంటు బాగా ప్రచారంలో ఉంది. అదేమిటంటే పయ్యావుల గెలిస్తే రాష్ట్రం మొత్తం మీద టిడిపి ఓడిపోతుందని అంటుంటారు. అలాగే పయ్యావుల ఓడితేనే టిడిపి అధికారంలోకి వస్తుందని టిడిపి నేతలే చెబుతుంటారు. అది సెంటిమెంటే కాకుండా నిజానికి నిజంగానే జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో పయ్యావుల గెలిచారు, టిడిపి ఓడిపోయింది.
సెంటిమెంటు విషయంలో పయ్యావుల కూడా తెగ బాధపడిపోతున్నారట. అంటే పయ్యావుల ఇప్పటి వరకూ అధికారపార్టీ ఎంఎల్ఏ అనిపించుకోలేదని తెగ ఫీలైపోతున్నారట. దాంతో పాటు మొన్నటి వైసిపి దెబ్బకు టిడిపికి భవిష్యత్ కష్టమే అని మద్దతుదారులు కూడా తెగ పోరు పెడుతున్నారట.
మద్దతుదారుల దెబ్బకు పయ్యావుల టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరితే అయినా అధికార పార్టీ అనిపించుకోవచ్చని అనుకుంటున్నారట. అంటే రాజీనామా చేసి అధికారంలో ఉన్న వైసిపిలో చేరి మళ్ళీ ఎన్నికల్లో పోటి చేస్తే అపుడు అధికార పార్టీ ఎంఎల్ఏ అనిపించుకోవచ్చట. మొత్తానికి ఏమవుతుందో చూడాల్సిందే.