తెలుగుదేశం పార్టీ మొన్నటి ఎన్నికల్లో గెలిచిందే కేవలం మూడు ఎంపీ సీట్లు అంటే.. అందులో ఓ ఎంపీ చంద్రబాబుకు చెవిలో జోరీగగా మారారు. చెప్పులో ముల్లుగా తయారయ్యారు.. ఆయనే కేశినేని నాని.


ఎంపీగా గెలిచిన నాటి నుంచే కేశినేని నాని వైఖరి తేడాగా ఉంది. బీజేపీ నేత గడ్కరీని కలిశాక ఆయన బీజేపీలోకి వెళ్లిపోతారని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఎక్కడకీ వెళ్లకుండా టీడీపీలోనే ఉండి సోషల్ మీడియా ద్వారా చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారు.


పార్టీ ఇచ్చిన పదవికి తిరస్కరించి.. వెటకారం ఆడిన కేశినేని నాని అప్పటి నుంచి ట్వీట్లు, ఫేస్ బుక్ ద్వారా కాకరేపుతున్నారు. తాజాగా ఆయన మరోసారి టీడీపీపై ఘాటు కామెంట్లు చేశారు. మరోసారి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేలా ట్వీట్ చేశారు.


‘తెలుగుదేశానికి ఇప్పుడు విషయం ఉన్నవాళ్లు కావాలి... షో చేసే వాళ్ళు కాదు’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. tdp now requires task masters not show masters.. ఇదీ కేశినేని ట్వీట్. మరి ఆయన ఉద్దేశ్యంలో షో మేకర్స్ ఎవరో.. ఎవరిని టార్గెట్ చేస్తూ ఈ ట్వీట్ పెట్టారన్నది ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: