కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం రాహుల్ గాంధీ ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైంది. చివరకు తన పూర్వీకుల నాటి రాజకీయ కోట అమేధీలోనూ స్వయంగా రాహుల్ గాంధీ ఘోరంగా ఓడిపోయారు.


చివరకు ఆ అవమానభారం తట్టుకోలేక.. పార్టీ అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేసిన పరిస్థితి. పార్టీ నేతలు ఎందరు బతిమాలినా ఆయన అధ్యక్ష పదవి మాత్రం తీసుకోనంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీకి ఓ చిన్న శుభవార్త కాస్త ఆనందపరిచింది.


అదే.. ట్విటర్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య కోటి దాటడం. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలియచేశారు. ఈ మైలురాయిని కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానుల మధ్య సెలబ్రేట్‌ చేసుకుంటానని రాహుల్‌ తన ట్వీట్ లో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: