తెలుగుదేశంపార్టీ ఆఫీసును కూల్చేస్తున్నారు. బుధవారం సాయంత్రం మొదలైన కూల్చివేత జిల్లా పార్టీలో సంచలనంగా మారింది. అయితే కూల్చివేస్తున్నది అధికారులో లేకపోతే ఇంకెవరో కాదు. స్వయంగా టిడిపి నేతలే కూల్చేస్తున్నారు. విషయం ఏమిటంటే గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన నేత అన్నం సతీష్ ప్రభాకర్ పార్టీకి, ఎంఎల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

 

ఎప్పుడైతే పార్టీ సభ్యత్వంతో పాటు ఎంఎల్సీ పదవికి సతీష్ రాజీనామా చేశారో వెంటనే  బాపట్లలో ఉన్న టిడిపి ఆఫీసును ఆయనే కూల్చేస్తున్నారు. పార్టీ ఆఫీసున్న స్ధలం, కార్యాలయాన్ని ఎవరు నిర్మించారనే విషయంలో సమాచారం లేదు. ఏదెవరిదైనా పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయటం మాత్రం వాస్తవం.

 

పార్టీ కార్యాలయాన్ని కూల్చివేస్తున్నట్లు తెలుసుకున్న నాయకులు అక్కడి చేరుకున్నారు. కార్యాలయాన్ని కూల్చకుండా అడ్డుకున్నా సతీష్ వెనక్కు తగ్గలేదు. దాదాపు కార్యాలయం మొత్తాన్ని కూల్చేశారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యాలయాన్ని కూల్చేయటం ఇదే మొదటిది.

 

టిడిపికి రాజీనామా చేయటమే కాకుండా చంద్రబాబునాయుడు, లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలే చేయటం పార్టీలో సంచలనంగా మారింది.  వార్డు మెంబరుగా కూడా గెలవలేని లోకేష్ ను చంద్రబాబు మంత్రిని చేసి బలవంతంగా అందరి నెత్తినా రుద్దినట్లు మండిపడ్డారు. ఎంఎల్ఏగా ఓడిపోగానే ఎంఎల్సీ పదవికి కూడా తాను రాజీనామా చేసినట్లు చెప్పారు. లోకేష్ కు కూడా సిగ్గుంటే వెంటనే ఎంఎల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: