గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో టిడిపి నేత ఉమాయాదవ్ హత్యకు గురయ్యారు. వైసిపి నేతలే తమ నేతను హత్య చేశారంటూ చంద్రబాబునాయుడు, నారా లోకేష్ అండ్ కో నానా యాగీ చేశారు. మంగళగిరిలో పర్యటించేందుకు చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారు. అయితే చివరి నిముషంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఎందుకు ?

 

తాజా పరిణామాలతో పర్యటన రద్దుకు అసలు కారణం తెలిసిపోయింది. ఎందుకంటే టిడిపిలో ఆధిపత్య పోరుతోనే ఓ నేతను ప్రత్యర్ధివర్గం హత్య చేసిందని బయటపడింది. మొన్నటి వరకూ వైసిపి నేతలే హత్యా రాజకీయాలు చేస్తోందంటూ చంద్రబాబుతో సహా అందరూ ఒకటే రచ్చ చేశారు.

 

తీరా చూస్తే టిడిపిలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతోనే ఉమాయాదవ్ హత్య జరిగిందని బయటపడింది. యాదవ్-ఏనుగు కిషోర్ మధ్య జరిగిన ఆధిపత్య పోరు కారణంగానే కిషోర్ వర్గం యాదవ్ ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఎప్పుడైతే ఉమాయాదవ్ హత్యకు కారణాలు బయటపడ్డాయో చంద్రబాబు, లోకేష్ కు ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు. దాంతో పర్యటనను కూడా రద్దు చేసుకున్నట్లు సమాచారం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: