చంద్రబాబుకు ఆశ ఎక్కువైంది. జగన్ ఓడిపోయి తానే మళ్ళీ సీఎం కావాలన్నది ఆ ఆశ. ఆయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు నెలలు కూడా కాలేదు. మరి చంద్రబాబు ఏంటి ఇలాంటి వింత వాదనలు చేస్తున్నారు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చంద్రబాబు అంతే.


అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు చంద్రబాబు దిగాలు గా అసెంబ్లీకి వచ్చి శివాలెత్తిపోయారు. చివరికి భారంగా  సభ నుంచి బయటకు వచ్చారు. ఆ మీదట మీడియాతో మాట్లాడుతూ జగన్ కి ఎందుకు అధికారం అప్పగించామని  ప్ర్జజలు బాగా బాధపడుతున్నారట. అపుడే ఇంకా ఓటేసిన చేతి ఇంకు తడి ఆరలేదు, జగన్ని గెలిపించామెందుకని జనం అనుకుంటారు. ఆ బాధ చంద్రబాబుది కానీ మరెవ‌రికి ఉంటుంది.


ఇదిలా ఉండగా అసెంబ్లీలో జగన్ మంత్రులు తనని అనరాని మాటలు అన్నారని బాబు గారు తెగ బాధపడిపోయారు. జగన్ పొలిటికల్ టెర్రరిజాన్న్ని ప్రోత్సహిస్తున్నాడని బాబు హాట్ కామెంట్స్ చేశారు. జగన్ పాలనలో ఎవరికీ న్యాయం జరగడం లేదని కూడా ఆవేదన చెందుతున్నారు. మొత్తానికి చూస్తే అధికారం పోయాక బాబు ఏమీ అర్ధం కాకుండా మాట్లాడుతున్నారిపిస్తోందని సెటైర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: