ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయలు తీసుకుంటున్నాడు. సంచలన నిర్ణయానికి మరో పేరు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి . గత 9 ఏళ్ళల్లో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఇప్పటి ఇలాంటి నిర్ణయాలను ఎవరు తీసుకోలేదు. పేద, ధనిక, కులం, మతం అనేది లేకుండా ప్రతిఒక్కరికి పధకాలు అందేలా అయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. 


పసికందు నుంచి వృద్ధుడు వరుకు ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి వైపు అడుగులు వేపిస్తున్న  వైఎస్ జగన్ ను చూసి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అతని తనయుడు మాజీ ఎంపీ నారా లోకేష్ జీర్ణించుకోలేక పోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు నెటిజన్లు. వైఎస్ జగన్ రాజీనామా ఎప్పుడెప్పుడు చేస్తాడా అని వారు ఎదురు చూస్తున్నారని నెటిజన్లు నారా లోకేష్, చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారు. 


నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా వైఎస్ జగన్ ను రాజీనామా చేస్తారా అంటూ ప్రశ్నిస్తే, తండ్రి అసెంబ్లీ సాక్షిగా జగన్ కు సవాలు విసురుతున్నారు. జగన్ ను రెచ్చగొట్టి రాజీనామా చేయించాలని ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. యువ నాయకుడు కదా ఉడుకు రక్తంతో రెచ్చిపోయి రాజీనామా చేస్తాడు అనుకుంటున్నారు ఏమో టీడీపీ అధినేత. 9 ఏళ్ళు చెప్పులు అరిగేలా నడిచి ముఖ్యమంత్రి అయినా జగన్ ఇక్కడ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: