ఈ రోజు అసెంబ్లీలో బాబును చూసి గిట్టనివారికి నవ్వుకున్నారు. తెలుగు తమ్ముళ్లు నోచుకున్నారు. మొత్తానికి బాబు నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో ఇలాంటి అవమానాలు ఎప్పుడు పడలేదు. తెలుగుదేశం ఓటమి.. బాబు రాజకీయ జీవిత పతనానికి పునాదిలా మారింది. పైగా 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యాక ఇక తెలుగుదేశం పార్టీ పనయ్యిపోయిందనే భావన కూడా టీడీపీ నాయకుల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే బాబుకు సరిగ్గా సపోర్ట్ కూడా చేయలేకపోతున్నారు. ఒకపక్క బాబును హేళన చేస్తుంటే.. టీడీపీ నాయకులూ సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు.
ఈ పరిణామాల అన్నిటినీ గమనిస్తే.. టీడీపీ పార్టీ బలం రోజురోజుకు మరింత దిగజారిపోతోందని అనిపిస్తోంది. బహుశా బాబుకి కూడా ఇలాగే అనిపిస్తోందేమో. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబును గమనించినట్లతే బాబు మొహంలో బెఱుకు సుస్పష్టంగా కనిపిస్తుంది. అలాగే బాబు మాటల్లోని తడబాటు, ఆవేదన బాగానే ఎలివేట్ అవుతుంది. అన్నిటికి మించి వైసీపీ ఎమ్మెల్యేలు 150 మంది మరియు ముఖ్యమంత్రి జగన్.. బాబును హేళన చేసేట్టుగా నవ్వడం నిజంగా తెలుగు తమ్ముళ్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పాపం బాబుగోరు.. చివరికీ ఇలా అయిపోయారేంటి ?