ఏపీ అసెంబ్లీ తీరు నానాటికీ దారుణంగా తయారవుతోంది. మంచి చెప్పే వామపక్ష సభ్యులు, ఇతర పార్టీల తటస్థ సభ్యులు  లేకపోవడంతో గత అసెంబ్లీ మాదిరిగానే ఈసారి కూడా టీడీపీ వైసీపీ సభ్యుల మధ్యనే సభ కేంద్రీక్రుతమైంది. అటు ఇటూ జగన్ చంద్రబాబు చోటు మార్చుకున్నా ఆ కక్షలు, కార్పణ్యాలు పోలేదు.


చంద్రబాబు ఇంకా సభలో పై చేయి కోసం పాలిటిక్స్  ప్లే చేయడం ఇక సంఖ్యాబలం చూసుకుని వైసీపీ సభ్యులు చెలరేగిపోవడంతో సభ అదుపు తప్పుతోంది. జగన్, చంద్రబాబు డైరెక్ట్ గానే మాటల యుద్ధం స్టార్ట్ చేశారు. సిగ్గులేని నవ్వు నీవూనూ అంటూ బాబు జగన్ని అంటే ఎందుకా వెటకారపు నవ్వు అంటూ జగన్ బాబుని అన్నారు.


ఇలా ఇద్దరూ ముఖ్య నాయకులే సహయం కోల్పోయి మాట్లాడుతూంటే సభంలో మిగిలిన వారి పరిస్థితి చెప్పనక్కరలేదు. ఈ రోజు ప్రశ్నోత్తరాల సందర్భంగా  సున్నా వడ్డీపై సభలో జరిగిన చర్చ రణరంగాన్నే తలపించింది. ఓ దశలో టీడీపీ, వైసీపీ సభ్యులు పరస్పరం కొట్టుకుంటారా అన్నంతగా వాతావరణం కనిపించింది. మొత్తానికి ఆ ముచ్చట కూడా ఈ సభలో చూసేస్తామన్న ఆందోళన మాత్రం అందరిలో ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: