తెలుగుదేశంపార్టీని నిండా ముంచేసేందుకు చంద్రబాబునాయుడు సన్నిహితుడే ప్లాన్ వేస్తున్నారు. సంవత్సరాల పాటు టిడిపిలో అన్నీ విధాలుగా అపరిమితమైన అధికారాలను అనుభవించి రెండుసార్లు రాజ్యసభ ఎంపిగా అయి కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన సుజనా చౌదరే ఇపుడు టిడిపిని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

 

బిజెపిలోకి ఫిరాయించిన తన సన్నిహితుడే టిడిపి నేతలను లాక్కునేందుకు వ్యూహాలు పన్నుతుంటే ఏం చేయలేక చంద్రబాబునాయుడు నానా అవస్తలు పడుతున్నారు. వార్డు కౌన్సిలర్ గా కూడా పోటి చేయని సుజనాకు చంద్రబాబు ఏ స్ధాయిలో ప్రాధాన్యత ఇచ్చారో అందరికీ తెలిసిందే. రెండుసార్లు రాజ్యసభ ఎంపి అయ్యారు. రాజ్యసభ పదవిని అడ్డుపెట్టుకునే వేల కోట్ల రూపాయల ప్రజాధానాన్ని బ్యాంకుల నుండి దోచేసుకున్నారు.

 

అలాంటి సుజనా ఈమధ్యే టిడిపి నుండి బిజెపిలోకి ఫిరాయించారు. అప్పటి నుండి ఆపరేషన్ కమలం అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని టిడిపి నేతలతో తనకున్న సన్నిహిత సంబంధాలను అడ్డం పెట్టుకుని వారిని బిజెపిలోకి వచ్చేట్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బాపట్లలో సీనియర్ నేత ఎంఎల్సీగా అన్నం సతీష్ ప్రభాకర్ రాజీనామా ఇందులో భాగమే అంటున్నారు.

 

సతీష్ కన్నా ముందే మరికొందరు నేతలు టిడిపికి రాజీనామాలు చేసేశారు. చందు సాంబశివరావు, ప్రకాశం జిల్లాలో ఈదర హరిబాబు కూడా రాజీనామాలు చేశారు. ఇంకా మరికొందరు రాజీనామాల బాటలో ఉన్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మొత్తం మీద చంద్రబాబు సన్నిహితుడే టిడిపిని ముంచేయటానికి రెడీ అవుతుండటమే విశేషం.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: