మామూలుగా చనిపోయిన వారి పేరుతోనే పథకాలు పెదతారు. కానీ చంద్రబాబునాయుడు హయాంలోనే చంద్రన్న పథకం అంటూ మొదలుపెట్టారు. ఇపుడు అదే ఒరవడిలో ఓ కీలక పథకానికి  బుగ్గన రాజేంద్రనాధరెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఓ పథకానికి జగన్మోహన్ రెడ్ది పేరు పెట్టారు.

 

జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాల్లో అమ్మఒడి పథకం కూడా బాగా కీలకమైనదే. ఆ పథకం ఎక్కడి నుండో అరువు తెచ్చుకున్నది కాదు. కాపీ కొట్టింది అంతకన్నా కాదు. పూర్తిగా జగన్ కసరత్తు చేసి ప్రవేశపెట్టిన పథకం. అందుకనే అమ్మఒడి పథకానికి జగన్ అమ్మఒడి పథకం అంటూ బుగ్గన బడ్జెట్లో  ప్రకటించారు.

 

ఈ పథకానికి బుగ్గన బడ్జెట్లో రూ 6455 కోట్లు కేటాయించారు.  ఇందులోనే పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పన,  మధ్యాహ్న భోజన పథకం, వైఎస్సార్ పాఠశాలల నిర్వహణ గ్రాంటు, అక్షయపాత్ర ఫౌండేషన్ వంటశాలల నిర్మాణానికి నిధులుంటాయి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: