ప్రపంచకప్ లో భారత్ సెమీస్ తో ముగించుకుని ఇంటికి చేరుకోవటంతో ఇప్పుడు చర్చంతా సీనియర్ క్రికెటర్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్ పైనే జరుగుతోంది. ధోనీ రిటైర్డ్మెంట్ తీసుకుంటాడనే ప్రచారం సాగుతోంది.అయితే రిటైర్మెంట్ అనంతరం ధోనీ బిజెపి పార్టీలో చేరతాడని కేంద్ర మాజీ మంత్రి ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ పాశ్వాన్ తెలిపారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధోనీ త్వరలోనే నరేంద్ర మోదీ టీంలో పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉందని ఆయన అన్నారు. 
ఇప్పటికే ఈ విషయం పై చాలా రోజులు గాచర్చలు జరుపుతున్నారు. అయితే ఆయన రిటైర్మెంట్ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని పాశ్వాన్ తెలిపారు.ధోని సొంత రాష్ట్రమైన జార్కండ్ లో ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో ధోని బీజేపీలో చేరితే  ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపుతారనే ప్రచారం ఊపందుకుంది.ధోనీ బీజేపీలో చేరేలా ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి అని తెలిపారు.  ఇప్పటివరకూ రిటైర్మెంట్ పైనే స్పష్టత ఇవ్వని ధోని,ఈ విష్యాలపై త్వరగా స్పందిస్తే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: