ఏపీలో బీజేపీ ఎక్కడ ఉంది అని ఎవరైనా అడుగుతారు. నిజమే ఎందుకంటే ఇపుడున్న కన్నా లక్ష్మీ నారాయణ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు. ఇక సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు అయితే టీడీపీలో చంద్రబాబుకు బాగా సన్నిహితులు. వీరిని పెట్టుకుని మరింతమందిని చేర్చుకుని ఏపీలో వెలిగిపోవాలనుకుంటోంది కాషాయం పార్టీ.
ఈ నేపధ్యంలో కొత్త వారు వస్తే వారికి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ ఆఫర్ రెడీగా ఉంచారట. అందుకోసం కన్నాను జాగా ఖాళీ చేసి ఉంచమంటున్నారు. ఇంతకాలం చేసింది చాలు, నీ కంటే పెద్ద కాపు వస్తున్నారంటూ పక్కకు నెడుతున్నారట. తాజాగా కండువాలు కప్పే ప్రోగ్రాంస్ లో ఎక్కడా కన్నా లేకపోవడం విశేషం. దాంతో ఆయన పోస్ట్ వూస్ట్ అన్న టాక్ వినిపిస్తోంది.
కాంగ్రెస్లో ఉన్న కన్నా తనతో పాటు బీజేపీలో చేరిన తన అనుచరులు, నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు బీజేపీలోని కొందరు నేతలే జాతీయస్థాయి నాయకత్వం వద్దకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే, జాతీయస్థాయిలోని నాయకత్వం కన్నాకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని అందుకే చేరికల అంశాల్లో ఆయనను దూరం పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలో ఆయన్ను పదవి నుంచి సైతం తప్పిస్తారని పలువురు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి.