వైసీపీ ఎంపీ, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ 2019 - 2020 బడ్జెట్ ను తొలిసారి వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వైసీపీ ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ ను ప్రతిపక్ష నేతలు పోటాపోటీగా విమర్శిస్తున్నారు. ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో చంద్రబాబు గురించి పోస్ట్ చేశారు. 


బడ్జెట్ గురించి చంద్రబాబు స్పందిస్తూ ముండదుచూపు లేని వైసీపీ బడ్జెట్ అని విమర్శలు చేసారు. ఈ విమర్శలపై విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ లో కౌంటర్ ఇస్తూ 'అమరావతి శంకుస్థాపనకే 300 కోట్లు నాకేసిన చంద్రబాబు గారికి బడ్జెట్లో 500 కోట్ల కేటాయింపు చాలా చిన్నదిగా అనిపించడం సహజమే. లక్ష కోట్లతో రాజధాని అంటూ మాయాబజారును కళ్ళకు కట్టారు. రాజధాని పేరుతో లెక్కలేనన్ని విదేశీ పర్యటనలు చేశారు. విదేశీ బృందాలతో గ్రాఫిక్స్ ప్రదర్శనలు తప్ప చేసిందేమిటి? అంటూ ట్విట్ చేసారు. 


ఈ ట్విట్ కు నెటిజన్ల నుంచి కామెంట్లు భారీ స్థాయిలో వస్తున్నాయి. నెటిజన్లు పెట్టిన కామెంట్ పెడుతూ 'ట్విట్టర్ లో వాదనలనే, వాళ్ళను జైలుకు పంపించే ఉదేశ్యం మీకు ఉందా అంటూ కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఇదే 'సర్, మనం ట్విట్టర్ లో వాదనలు చేస్తూ ఉంటామా లేక జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించి వాల్లను శ్రీ క్రృష్ణ జన్మస్థానంకి పంపుతామా?' అంటూ కామెంట్ పెట్టాడు ఓ నెటిజన్. విజయ్ సాయి రెడ్డి ఇచ్చిన కౌంటర్ కు చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: