నేడు  జరుగుతున్న అసెంబ్లీ నభలలోప్రతిపక్షం అడిగిన అన్ని ప్రశ్నలకి ఆర్ధిక మంత్రి బుగ్గన ఇరవై నిమిషాల పాటు అన్నిటికి సమాధానం చెప్పారు. ఆ తరువాత చంద్రబాబు లేచి ఇంకొన్ని ప్రశ్నలు అని అనగా జగన్ మోహన్ రెడ్డి లేచి, ఆర్ధిక మంత్రి సమాధానం చెప్పిన తరువాత మళ్లీ ప్రశ్నలు అనడం ఎక్కడి సాంప్రదాయం అని అడిగారు కానీ మెము అవకాశం ఇస్తాం అని చెప్పారు.

అప్పుడు స్ఫీకర్ కూడా ఇలా చేయడం ఇప్పటి వరకు యే సభలోనూ జరగలేదని చంద్రబాబు కొత్త సాంప్రదాయం తీస్కొస్తున్నరా అని ప్రశ్నించారు. దీని మీద సభలో చాలా కోలాహలం ఎర్పడింది. 'లీడర్ ఆఫ్ అపోజీషన్ అడిగారు కాబట్టి గౌరవంతో మీకు మాట్లాడే అవకాశం ఇచ్చాం కానీ సాంప్రదాయం ఇది మాత్రం కాదు' అని స్పీకర్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: