ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడే విధానంపై విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు. అనిల్ కుమార్ యాదవ్ మంత్రి కాదు నెల్లూరు రౌడీ అని అంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్. అనిల్ కుమార్ యాదవ్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని విమర్శలు చేస్తున్నారు. 


అనిల్ కుమార్ యాదవ్ నోరు అదుపు చెయ్యాల్సింది వైఎస్ జగన్ అనే అని, ప్రతిపక్ష నాయకులూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అనిల్ కుమార్ యాదవ్ ఎదురు దాడికి తిరుగుతున్నారని అని ఎమ్మెల్సీలు వ్యాఖ్య చేస్తే, తెలుగు దేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ లో అనిల్ కుమార్ యాదవ్ ను రౌడీ అంటూ చిత్రీకరించిన ఫోటోని పోస్ట్ చేసింది. 


తెలుగు దేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అనిల్ కుమార్ యాదవ్ వివిధ రకాలుగా ఉన్న ఫోటోలను తీసుకొని 'ఈయన సినిమా పోస్టర్ లో విలన్ కాదు.. చట్ట సభలో మంత్రిగారు'' అంటూ ట్విట్ చేశారు. అయితే ఈ ట్విట్ పై స్పందించిన నెటిజన్లు అచ్చన్నాయుడు ఫోటోలు చూపించండి, అలాగే ఇంతకు ముందున్న బొండా, ఉమా, యనమల్ అందరివీ చూపించండి అంటూ ఘాటుగా స్పదింస్తు ట్విట్ చేశారు. మరి ఈ విమర్శలకు, ఈ ట్వీట్లకు అనిల్ కుమార్ యాదవ్ ఎలా స్పందిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: